S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/20/2018 - 01:11

మనదేశ జనాభాలో సగం మంది పాతికేళ్ల లోపు యువకులే. అరవై శాతం మంది 35 సంవత్సరాల లోపువారు. వచ్చే రెండు సంవత్సరాలలో భారతదేశ జనాభాలో సగటు వయసు 29 ఏళ్లు ఉంటుంది. యువశక్తి అధికంగా ఉండడం అన్నది దేశం అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. యువతరంతో వర్థిల్లుతున్న భారత్‌కు ఈ పరిణామం మేలు చేస్తోందా? ఉపయోగపడుతుందా? అంటే ఔనని గట్టిగా చెప్పలేకపోతున్నాం.

01/18/2018 - 01:02

తరగతి గది కొన్నిసార్లు గత తరానికి అంజలి ఘటించే స్థలంగా మారిపోతుంది. సైన్స్‌లో ఎం.జి.కె. మీనన్ అపారమైన సేవచేసి ఐదు దశాబ్దాలుగా విజ్ఞాన రంగంలో ప్రముఖమైన పాత్ర వహించి 88 సంవత్సరాల వయసులో మరణించారు. ఉపాధ్యాయుడు ఆనాడు పాఠాన్ని అక్కడ పెట్టి జీవనయానంలో ప్రపంచానికి విజ్ఞాన శాస్త్రం ప్రసాదించిన మహానుభావుల యొక్క సేవలను ప్రస్తావిస్తాడు. సైంటిఫిక్ కల్చర్‌ను నేర్పిస్తాడు.

01/17/2018 - 00:49

జనవరి 3న నేను రాసిన వ్యాసానికి స్పందనగా జాన్ తిమోతి జనవరి 13న ‘‘సాఫ్ట్‌వేర్ కాదు.. సమానత్వం ముఖ్యం’’ అని రాసిన సమాచారం చదివాను. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అయితే ఆ అభిప్రాయాలు, ఆలోచనలు ఏ మేరకు ప్రాసంగికమైనవన్నదే ప్రధానం. సమకాలీన సమాజానికి ఉపయుక్తంకాని అభిప్రాయాలు, ఆలోచనలకు ‘కరెన్సీ’ ఉండదు. కానీ ఉంటుందని ఊహించుకునేవారి అభిమతానికి ఎవరెందుకు అడ్డు చెబుతారు?

01/13/2018 - 01:06

అఖండ భారతావనిలో మెజారిటీ జనం భూమిని నమ్ముకుని బతికేవాళ్లే. తరతరాల భూదోపిడీ నుండి తమను తాము కాపాడుకోవడానికి, భూస్వాముల గుండెల్లో పేలిన తుపాకీ తూటాయే నక్సలిజం. ఇది చరిత్ర కాదనలేని యదార్థం. ఈనెల 3వ తేదీన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల నరసింహం రాసిన వ్యాసం చదివి ఇది రాయవలసి వచ్చింది. ‘సాయుధ పోరు కాదు.. సాఫ్ట్‌వేర్ ముఖ్యం’ అనేది ఆయన వాదన. ఆ వ్యాసంయొక్క సారాంశం అది.

01/10/2018 - 21:49

తరగతి లక్ష్యం పాత పుస్తకాల నుంచి కొత్త పుస్తకాలకు మార్చటం కాదు. విద్యార్థి ఆలోచనా విధానాన్ని మార్చటమే సామాజిక మార్పునకు దోహదపడుతుంది. కరికులం మార్చినంత మాత్రాన తరగతి గదికి కొత్త స్వరూపం రాదు. ఉపాధ్యాయుడు మారాలి. చెప్పవలసిన విషయం మాత్రం ప్రభుత్వం చెప్పవచ్చును. కానీ చెప్పేది ఉపాధ్యాయుడు. టీచింగ్ సంపూర్ణంగా మారాలి. అనగా బోధన విద్యార్థిలో ఆసక్తిని కలిగించాలి.

01/10/2018 - 01:00

(నేడు గ్రంథావిష్కరణ సందర్భంగా...)
*

01/07/2018 - 00:38

ఇటీవల భర్తను ప్రియుడితో కుమ్మక్కై చంపే భార్యల విషయంలో ప్రచార, ప్రసార మాధ్యమాలు లక్ష్మణ రేఖను దాటాయా ?. ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసులను కోర్టులు విచారించి నిందితులపై అభియోగాలు రుజువైతే శిక్షను విధిస్తాయి. నిర్దోషిగా తేలితే వదిలేస్తాయి. కాని మీడియా మాత్రం భర్తను చంపే భార్యల పట్ల ఎక్కువగా ఫోకస్ చేసి ప్రతి అంశాన్ని బూతద్దంలో చూసి ప్రసారం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

01/06/2018 - 01:29

భారత సమాజం అభివృద్ధి కుల నిర్మూలనతోనే సాధ్యమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఆధునికత పెరిగేకొద్దీ కులం గోడలు బలహీనపడతాయని ఆశించారు. అయితే దురదృష్టవశాత్తూ దేశం ఆ దిశగా పనియంచడం లేదు. అందుకు పూర్తి వ్యతిరేక దిశలో కుల స్థిరీకరణ దిశగా సాగుతోంది. కులాన్ని కానీ, మతాన్ని కానీ ఒక అస్తిత్వ చిహ్నంగా భావించినంతవరకూ ఏ గొవడా లేదు. ఎవరి అభిప్రాయం వారిది అని సరిపెట్టుకోవచ్చు.

01/03/2018 - 21:43

ప్రపంచీకరణ సాంకేతిక విప్లవంతో వచ్చిన మార్పులవల్ల తరగతి గదిలో ఒకే రంగున్న పిల్లలు కనబడరు. ఒకే రకమైన ముఖవర్ఛస్సున్న పిల్లలు కనపడరు. వాటితోనే ఆ పిల్లలపైన మన అభిప్రాయాలను పెంచుకుంటున్నారు. ముక్కు లొందకు పోతే అస్సామీ, నేపాలీ అనుకుంటారు. లేదా చైనీయుడు అనుకుంటాం. మనిషి రంగు చామనఛాయగా ఉంటే మధ్యప్రాచ్యం (ఆస్ట్రేలియా, ఈజిప్టు) వారని, తెల్లగా ఉంటే ఐరోపా వారని అనుకుంటాం.

01/03/2018 - 00:33

క్లాప్ కొట్టిన రెండు దశాబ్దాలకు సినిమా రిలీజ్ అయినట్టు, రెండు దశాబ్దాల క్రితం చెప్పిన రాజకీయ రంగ ప్రవేశం ముహూర్తం ఇప్పటికి ఖరారైనట్టే. అది కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి, అంటే సాధారణంగా అయితే మరో మూడేళ్ల తరువాత పూర్తి పిక్చరు వస్తున్నట్టు. ఈలోగా సినీ పరిభాషలో చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్, రీరికార్డింగ్, ట్రైలర్ రిలీజు.. అంతేనన్నమాట.

Pages