S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2017 - 02:57

హైదరాబాద్, ఏప్రిల్ 30: అసెంబ్లీ సమావేశానికి అనుమతించకపోవడంపై బిజెపి ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై రుసరుసలాడారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద ఆదివారం బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కొంత సేపు నిరసన దీక్ష చేపట్టారు.

05/01/2017 - 02:54

హైదరాబాద్, ఏప్రిల్ 30: శనివారం కన్నుమూసిన ప్రభుత్వ సాగునీటి రంగం సలహాదా రు ఆర్ విద్యాసాగర్‌రావు పార్థివ దేహానికి ఆదివారం ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంబర్‌పేట శ్మశాన వాటికలో విద్యాసాగర్‌రావు చితికి ఆయన కుమారుడు వెంకటరమణ నిప్పంటించారు. పోలీసు బెటాలియన్ గౌరవ సూచకంగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్చి, గౌరవ వందనం సమర్పించింది.

05/01/2017 - 02:51

హైదరాబాద్, ఏప్రిల్ 30: భగవత్ రామానుజులు అభ్యుదయవాది అని, సమాజంలో హెచ్చుతగ్గులు లేకుండా, ప్రజలంతా సమానమేనని ఆచరణలో చూపించారని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సందర్భంగా శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ నేతృత్వంలో ఆదివారం నెక్లెస్ రోడ్డులో ‘సమతార్యాలీ’ నిర్వహించారు. దాదాపు వెయ్యికార్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి.

05/01/2017 - 02:45

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 2013 భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును తిరస్కరించాలని టి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జీని కోరారు. ఈ మేరకు త్వరలో రాష్టప్రతిని కలిసి బిల్లును శాసనసభలో ఆమోదించిన ప్రభుత్వ తీరును వివరిస్తామని, బిల్లును తిరస్కరించి రైతాంగ ప్రయోజనాలను కాపాడలని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.

05/01/2017 - 02:43

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఏప్రిల్ 30: అతి ముఖ్యమైన భూసేకరణ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లుపై ఎలాంటి చర్చజరపకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఆమోదించి సభను ముగించడం సిగ్గుచేటని కాంగ్రెస్ శాసనసభ పక్షం మండిపడింది. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరమని పేర్కొంది. యావత్ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి సైతం లేకుండా ఆమోదించుకోవడం ఏమిటని సిఎల్‌పి నేత జానారెడ్డి నిలదీశారు.

05/01/2017 - 02:42

హైదరాబాద్, ఏప్రిల్ 30: ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 38 కేసులు వేసిందని, శాసన మండలి, శాసన సభలో ఆదివారం ఆమోదించిన బిల్లు వల్ల కేసులు వీగిపోతాయనేది కాంగ్రెస్ భయం అని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శాసన సభలో, మండలిలో బిల్లు ఆమోదం పొందిన తరువాత హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.

05/01/2017 - 02:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: స్కైవేల నిర్మాణాలకు హైదరాబాద్‌లో అవసరమైన 100 ఎకరాల రక్షణ భూమిని తెలంగాణకు కేటాయించాలని మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్, ఎంపీలు జీతేందర్‌రెడ్డి, వినోద్ కుమార్‌లు కేంద్ర ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.

05/01/2017 - 02:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: గడ్చిరోలి కోర్టు తీర్పుతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ ప్రజాసంఘాలు సాయిబాబా ఆరోగ్య కారణాల దృష్ట్యా మెరుగైన వైద్యసేవల కోసం వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాయి.

05/01/2017 - 02:39

హైదరాబాద్, ఏప్రిల్ 30: భారత రక్షక దళాలకు చెందిన సైనికులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ మొదలగునవి)కు చెందిన సిబ్బంది తమ విధి నిర్వహణలో తీవ్రవాదులు, ఉగ్రవాదుల వల్ల ప్రాణాలు కోల్పోతే వారి పిల్లలకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐఎఎస్ అధికారుల సంఘం నిర్ణయించింది.

05/01/2017 - 02:39

సిద్దిపేట, ఏప్రిల్ 30 : సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పోలీసులు ఆక్రమ ఆయుధాలు కలిగిన నల్గురు వ్యక్తులను ఆదుపులోకి తీసుకుని, మూడు తుపాకులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే సోదరుడు రాంచందర్, మరో వ్యక్తిని సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు, తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Pages