S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2017 - 00:31

‘లేదురా ఇటువంటి భూమి ఇంకెందు! లేదురా మన వంటి వీరులెంకెందు’- అంటూ పొరపాటున ఏ స్కూలు వాళ్ళైనా పాడిస్తారేమో గానీ- ‘లేదురా మన వంటి జాతీయ జెండా యింకెందూ’- అన్నది- 1947 ఆగస్టు 14, అర్ధరాత్రి ఎఱ్ఱకోట బురుజుపైన మాత్రమే కాదు- ఇండియాలో యింటింటా పిల్లకాయల జేబులమీద ఎగిరిన తరుణం నుంచీ, జాతీయ భక్తిగీతాలలో- త్రివర్ణాంకిత పతాకం అంతర్భాగం అయిపోయింది.

01/16/2017 - 00:29

ఆగ్నేయాసియా దేశాలు 1997లో భయంకరమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా భారీ ద్రవ్యోల్బణంతో 50 బిలియన్ల డాలర్ల లోటు బడ్జెట్‌తో మునిగిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉద్యోగాలు పోయాయి. ప్రజలు రోడ్డునపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి కఠిన షరతులతో అప్పుఇచ్చినా సంక్షోభం తీరలేదు. అప్పుడు అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంపై ప్రజలనుద్దేశించి- ‘మీవద్ద ఎంత బంగారం ఉంటే అంతా ఇచ్చేయండి..

01/16/2017 - 00:26

‘ఓ తప్పుడు విధానాన్ని పదే పదే ప్రచారం చేస్తూ పోతే ఒప్పుగా మారుతుందనే’ది గోబెల్స్ తత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రచారానే్న సాగిస్తున్నాయి. విద్యా విధానంలో ఈ వింత ధోరణి మరీ ఎక్కువైంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సిఎం చంద్రబాబు అనుసరించిన విధానాలే విద్యా రంగానికి ఉరితాడుగా బిగుస్తున్నాయి.

01/16/2017 - 00:25

మన స్థూల జాతీయ ఉత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతం పెరుగుతుందన్నది ‘నీతి ఆయోగ్’ చేసిన నిర్ధారణ. మన దేశపు స్థూల జాతీయ ఆదాయం ఈ ఆర్థిక -2016,2017- సంవత్సరంలో ఏడు శాతం పెరుగుతుందన్నది ‘ప్రపంచబ్యాంక్’ వారు చేసిన నిర్ధారణ. ఈ సమాంతర నిర్ధారణలలో ఇలా ఒక శాతం అంతరం ఏర్పడి ఉండడం విచిత్రమైన వ్యవహారం.

01/16/2017 - 00:21

న్యూఢిల్లీ, జనవరి 15: త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, రాబోయే బడ్జెట్‌పై మదుపరుల అంచనాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పవర్ తదితర అగ్రశేణి సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయ.

01/16/2017 - 00:20

న్యూఢిల్లీ, జనవరి 15: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరను 42 పైసలు, డీజిల్ ధరను 1.03 పైసలు చొప్పున పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలోనే పెంపు అనివార్యమైందని ఓ ప్రకటనలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) తెలిపింది.

01/16/2017 - 00:19

రాజమహేంద్రవరం, జనవరి 15: విదేశీ వంట నూనెలు స్వదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వంట నూనెలను దేశీయంగానే తయారు చేసి, విక్రయంచాలన్న కల.. కలగానే మిగిలిపో తోంది. స్వయం సమృద్ధి సాధించేందుకు గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం కేవలం 10 శాతానికే పరిమితమైంది. 90 శాతం అవసరాలు విదేశీ వంట నూనెలపైనే తీరుతున్న పరిస్థితి.

01/16/2017 - 00:18

న్యూఢిల్లీ, జనవరి 15: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్.. భారతీయ చిహ్నాలు, ప్రతీకలపట్ల వ్యవహరిస్తున్న తీరును కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ రకమైన చులకన భావాన్ని సహించబోమని, మార్పు రాకపోతే ఇబ్బందులేనని హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ మేరకు ఆదివారం అమెజాన్‌కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారతీయ చిహ్నాలు, ప్రతీకల గురించి చులకనభావాన్ని వీడాలని హితవు పలికారు.

01/16/2017 - 00:07

ముంబయి, జనవరి 15: హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ లిమిటెడ్ (హెచ్‌సిసిబిఎల్).. దేశీయంగా రెండు ప్లాంట్ల ఏర్పాటుకు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. అహ్మదాబాద్, నెల్లూరుల్లో ఈ రెండు ప్లాంట్లు రానున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్‌సిసిబిఎల్.. 26 బాట్లింగ్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. దేశీయంగా కోకా-కోలా బాట్లింగ్ తయారీలో దాదాపు 65 శాతం హెచ్‌సిసిబిఎల్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

01/16/2017 - 00:05

న్యూఢిల్లీ, జనవరి 15: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. సంస్కరణల బాట పట్టింది. రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్ట్స్‌ల్లో పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించింది. అంతేగాక బ్రోకర్ ఫీజునూ తగ్గించింది.

Pages