S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 18:10

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మెదక్‌ జిల్లా జోగిపేటకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన షేక్‌ షకీరాను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆరుగురు విద్యార్థులను కోల్‌కతాలకు తీసుకెళ్లి వీరు ప్రశ్నాపత్రం అందజేసినట్లు సీఐడీ గుర్తించింది.

08/04/2016 - 17:06

అమలాపురం : ఒక్కగానొక్క కుమారుడు తల్లిని శ్మశానంలో వదిలేసి వెళ్లిన ఘటన అమలాపురంలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పేరూరులో ఉప్పు సత్యవతి(80) గుడిసెలో ఉంటోంది. ఈమె కుమారుడు హనుమంతరావు రాజమహేంద్రవరంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కదల్లేని స్థితిలో ఉన్న తల్లిని బుధవారం హనుమంతరావు రాజమహేంద్రవరం తీసుకెళ్లాడు. అత్త సత్యవతి పోషణ భారం తీసుకునేందుకు హనుమంతరావు భార్య నిరాకరించింది.

08/04/2016 - 16:59

విశాఖ: విశాఖ జిల్లా రోలుగుంటలో గురువారం తరలించడానికి సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలించడానికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

08/04/2016 - 16:51

దిల్లీ: ఈరోజు బంగారం ధర రూ.200 తగ్గింది. బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.31,050కి చేరింది. సింగపూర్‌లో ఔన్స్‌ బంగారం ధర 0.4 శాతం తగ్గి 1,352.48 అమెరికా డాలర్లకు చేరింది. కిలో వెండి ధర రూ.870 తగ్గి రూ.46,950కి చేరింది.

08/04/2016 - 16:29

ముంబయి: ఈరోజు మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్లు లాభపడి 27714 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 8551 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.95 వద్ద కొనసాగుతోంది.

08/04/2016 - 16:25

ముంబై: 2015లో అమెరికా జాతీయురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో బాలీవుడ్ దర్శక, నిర్మాత మహ్మద్ ఫరూఖీని దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష , రూ.50వేల జరిమానా విధించింది. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న అమెరికా జాతీయురాలు పరిశోధన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఫరూఖీతో ఆమెకు పరిచయం అయింది. ఫరూఖీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

08/04/2016 - 16:18

హైదరాబాద్ : భూసేకరణకు ఉద్దేశించిన 123జీవోను హైకోర్టు కొట్టివేయడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, న్యాయనిపుణులతో సీఎం కేసీఆర్ భేటీ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కేసీఆర్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

08/04/2016 - 15:50

కోల్‌కత: వైమానిక దళానికి చెందిన హాక్‌ అడ్వాన్స్‌డ్‌ జెట్‌ ట్రైనర్‌ కలైకుంద ( పశ్చిమ బెంగాల్‌లో టేకాఫ్‌ సమయంలోకుప్పకూలింది. జెట్‌లోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. టేకాఫ్‌ అవ్వగానే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది.

08/04/2016 - 15:41

విజయవాడ: జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, ఏకీకృత పన్ను విధానం అటు దేశానికి, ఇటు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.4,700కోట్లు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఐదేళ్ల పాటు రూ.23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలన్నారు.

08/04/2016 - 15:36

హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూ సేకరణ విషయమై జారీ చేసిన 123 జీవోను హైకోర్టు కొట్టివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను తెలంగాణ సర్కారు అనే్వషిస్తోంది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ గురువారం ఇక్కడ పలువురు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లాలా? లేదా? అన్న విషయమై కెసిఆర్ సమాలోచనలను జరుపుతున్నారు.

Pages