S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 12:12

హైదరాబాద్: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఇక్కడ ఎపి సచివాలయంలో రాష్ట్ర కార్మిక, క్రీడలశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిశారు. హిందూపురం నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

08/04/2016 - 12:12

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా అంకితభావంతో, సమర్ధతతో పనిచేయాలని, ప్రజాసేవకు ఇదొక అరుదైన అవకాశమని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు, పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణా, పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన సదుపాయాలు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదన్నారు.

08/04/2016 - 12:11

అనంతపురం: ప్రసన్నాయపల్లి వద్ద గురువారం ఉదయం రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు రిలయన్స్ సంస్థలో ఇంజనీర్లుగా, మరొకరు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువు గిరిగా పోలీసులు గుర్తించారు. సునీతకు వరసకు అల్లుడైన గిరి మరణించడంతో పెద్ద సంఖ్యలో సమీప గ్రామాలవారు ప్రమాద స్థలానికి వచ్చారు. మంత్రి సునీత హుటాహుటిన ప్రసన్నాయపల్లికి వచ్చి గిరి తల్లిదండ్రులను ఓదార్చారు.

08/04/2016 - 12:11

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు దిల్లీ చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉప రాష్టప్రతి, పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకుంటారు. ఈనెల 12 నుంచి జరిగే కృష్ణాపుష్కరాలకు రావాల్సిందిగా వీరిని ఆహ్వానిస్తారు.

08/04/2016 - 12:11

హైదరాబాద్: ప్రధాని మోదీ ఈనెల 7న ఒకరోజు పర్యటనకు వస్తున్నందున పలుచోట్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎస్‌పిజి (ప్రత్యేక భద్రతా దళం) అధికారులు గురువారం నగరానికి చేరుకున్నారు. గజ్వేల్, రామగుండం, హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన ఉన్నందున ఈ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మోదీ బహిరంగ సభ జరిగే ఎల్‌బి స్టేడియంను ఎస్‌పిజి అధికారులు పరిశీలించారు.

08/04/2016 - 12:10

హైదరాబాద్: ప్రధాని హోదాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బిజెపి నేతలు ఎల్‌బి స్టేడియంలో గురువారం సుదర్శనయాగం నిర్వహించారు. ఈనెల 7న వస్తున్న మోదీ గజ్వేల్‌లో మిషన్ భగీరథను, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎల్‌బి స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు.

08/04/2016 - 12:10

ఒంగోలు: ఆర్టీసీ బస్సు, సిమెంటు లోడ్‌తో వెళుతున్న లారీ పరస్పరం ఢీకొనడంతో 23 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. సంతమాగలూరు వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వినుకొండ నుంచి నరసారావుపేట వెళుతోంది.

08/04/2016 - 12:09

హైదరాబాద్: రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని మార్బుల్స్ లోడ్‌తో వెళుతున్న వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట వద్ద రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ క్యాబిన్‌కు, మార్బుల్ రాళ్లకు మధ్య ఇరుక్కుని ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సికిందరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

08/04/2016 - 12:09

మెదక్: ఓ కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున ఇంటిపై కిరోసిన్ పోసి కొందరు దుండగులు నిప్పంటించారు. జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో ఈ ఘటన జరిగింది. మంటలు వ్యాపించడంతో అతి కష్టమీద తలుపులు తీసుకుని కుటుంబ సభ్యులు బయటపడ్డారు. ఇంటి యజమాని సుంకయ్య, అతని భార్య సునీత, పిల్లలు వీరేష్, క్రిష్, దాన్యాలు గాయపడ్డారు. వీరిని సికిందరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

08/04/2016 - 09:01

రియో డి జెనీరో, ఆగస్టు 3: రియో డి జెనీరోలో భారత బృందానికి బుధవారం ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులు రియో క్రీడా గ్రామానికి చేరుకొని, తమకు కేటాయించిన గదుల్లో బస చేస్తున్నారు. అయితే, ఒక్కో దేశ బృందాన్ని ఆహ్వానించడానికి ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఒసి) ఒక్కో తేదీని ఖరారు చేసింది. అధికారికంగా బుధవారం భారత్ వంతు వచ్చింది.

Pages