S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో శుభారంభమే అత్యంత కీలకమని భారత హాకీ జట్టు గోల్కీపర్, కెప్టెన్ శ్రీజేష్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఎనిమిది పర్యాయాలు ఒలింపిక్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్న భారత్ చాలా కాలంగా అదే స్థాయిలో రాణించలేకపోతున్నది. పతకం మాట ఎలావున్నా, ఒలింపిక్స్కు అర్హత సంపాదించడానికే నానా తంటాలు పడుతున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఒలింపిక్స్లో భారత హాకీ గత కీర్తి ఎంతో ఘనం. నేడు అది అంతంత మాత్రం. ఒకప్పుడు ప్ర పంచాన్ని శాసించిన భారత హాకీ నేడు ఉనికి కోసం అల్లా డుతున్నది. ఒలింపిక్స్లో మన ప్రస్థానం సాగిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒలింపిక్స్లో అంతకు ముందు మూడు పర్యాయాలు స్వర్ణ పతకాలు సాధించినా అప్పటి మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు.
కింగ్స్టన్, ఆగస్టు 3: భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ని డ్రా చేసుకోవడానికి విండీస్ పోరాడు తున్నది. నాలుగు వికెట్లకు 48 పరు గుల ఓవర్నైట్ స్కోరుతో చివరి రో జైన బుధవారం ఆటను కొనసాగిం చిన ఆ జట్టు భోజన విరామ సమ యానికి మరో వికెట్ కోల్పోయ 215 పరుగులు చేయగలిగింది. జెర్మయ న్ బ్లాక్వుడ్ 63 పరుగులు సాధించి అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యా డు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: యువ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి లైన్ క్లియర్ అయంది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్లుడబ్ల్యు) అమోదముద్ర వేయడంతో అతనికి రియో టికెట్ ఖాయమైంది. భారత రెజ్లింగ్ సంఘం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విషయాన్ని ధ్రువీకరించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా నర్సిం గ్పై తాత్కాలిక వేటు పడిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: చారిత్రాత్మక జిఎస్టి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపట్ల పారిశ్రామిక, వ్యాపార రంగాలు హర్షం వ్యక్తం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఈ వస్తు, సేవల పన్ను (జిఎస్టి)కు రాజ్యసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం అభినందించదగ్గ పరిణామంగా పలువురు అభిప్రాయపడ్డారు.
‘దేశంలో పన్నులకు సంబంధించి అతిపెద్ద సంస్కరణ ఇది. దీనివల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలుంటాయి.’
విశాఖపట్నం, ఆగస్టు 3: వైద్య పరికరాల తయారీకి సంబంధించి పరిశ్రమలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పా టు చేసేందుకు వీలుగా ప్రభుత్వం మెడ్టెక్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దక్షిణాసియాలోనే తొలి మెడికల్ పరికరాల ప్రాజెక్టుకు విశాఖ కేంద్రం కానుంది. పెదగంట్యాడ మండలం నడుపూరులో 270 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక వైద్య పరికరాల తయారీ జోన్ను ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 3: టెక్ సంస్థ ఆర్డిపి వర్క్స్టేషన్స్.. బుధవారం ఇక్కడ ‘తిన్బుక్’ పేరిట 14.1 అంగుళాల చౌక ల్యాప్ట్యాప్ను పరిచయం చేసింది. దీని ధర 9,999 రూపాయలు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు దీన్ని ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా దీన్ని రూపొందించామని, ఇదే ఇప్పటిదాకా అత్యంత చౌక ల్యాప్ట్యాప్ అని కూడా సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఎంతోకాలంగా వేచిచూస్తున్న మోటార్ వాహనాల (సవరణ) బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ఈ బిల్లు అమలుతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు పడనున్నాయి. మద్యం సేవించి నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా, ప్రమాద తీవ్రతనుబట్టి 2 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
విజయవాడ, ఆగస్టు 3: ఉభయ గోదావరి జిల్లాల్లోని గృహాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు పైపులైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. గోదావరి గ్యాస్ పేరుతో ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో గెయిల్ 74 శాతం, హెచ్సిపిఎల్ 26 శాతం ఈక్విటీ కలిగి ఉంటాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ద్రవ్య, ఆర్థిక విధానాల మద్దతుతో భారత వృద్ధిరేటు 8 శాతాన్ని అందుకోగలదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పి అభిప్రాయపడింది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశ జిడిపి వృద్ధి 8 శాతాన్ని చేరగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే సంస్కరణల అమలు మందగిస్తే మాత్రం వృద్ధి పతనం కాకతప్పదని హెచ్చరించింది.