S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 06:00

హైదరాబాద్, మార్చి 26: రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు ఎపి ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గణనీయంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వ్యాట్ విభాగాల లక్ష్యాలను అమాంతం పెంచడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్సైజ్ శాఖ అయితే ఎకాఎకిన రూ. 1100 కోట్లు ఎక్కువగా ఆదాయాన్ని వసూలు చేయాలని నిర్ణయించింది. ఏ వస్తువులు కొనుగోలు చేసినా వ్యాట్ పన్నులు చెల్లించక తప్పదు.

03/27/2016 - 06:00

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 26: నగరంలోని ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం ఘాట్ వరకూ చేపట్టదలచిన రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా బ్లూ అండ్ గ్రీన్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన స్థల సేకరణకై సమగ్ర సర్వే నిర్వహించాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ టౌన్ ప్లానింగ్ అధికారులను అదేశించారు.

03/27/2016 - 06:00

హైదరాబాద్, మార్చి 26: మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రుణాలు ఇవ్వడం లేదని వైకాపా ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి ఆరోపించారు. శాసనసభలో శనివారం డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొంటూ, స్వయం సహాయ గ్రూపుల రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రజలకు టిడిపి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

03/27/2016 - 05:59

హైదరాబాద్, మార్చి 26: రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిలకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఊరట లభిస్తోంది. ఇప్పటి వరకు 50 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తేనే వారికి ఉచిత సౌకర్యం వర్తించేది. 51 యూనిట్లు లేదా అంతకు మించి విద్యుత్తు వినియోగిస్తే మొత్తం బిల్లు లబ్ధిదారులే చెల్లించాల్సి వస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొదటి 50 యూనిట్ల వరకు ఉచిత సదుపాయం ఉంటుంది.

03/27/2016 - 05:59

విజయవాడ, మార్చి 26: భారతదేశంలో జన్మించి ఇక్కడ బతుకుతున్న వారంతా భారత్ మాతాకి జై అనాల్సిందే... అసలు ఇందులో తప్పు ఏమిటి. ఈ దేశంలో సర్వమతాలు, కులాల వారున్నారు. వారందరికీ జై అనే్నట్లే కాగలదని కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విభిన్న జాతులు, సంస్కృతులు, వ్యక్తుల సమూహాన్ని కలిదించే శక్తి ఏ వ్యక్తి.. ఏ దేశానికి లేదన్నారు.

03/27/2016 - 05:59

హైదరాబాద్, మార్చి 26: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో ఐదువేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని శాసనసభలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.

03/27/2016 - 05:58

హైదరాబాద్, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీల నుంచి మొదలుకుని నగర పాలక సంస్థల వరకు దశల వారీగా వీధి దీపాలకు ఎల్‌ఇడి బల్బులను వినియోగంలోకి తెస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గృహసంబంధ వినియోగంలో ఇప్పటి వరకు సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను అందుబాటులోకి తేవడం వల్ల భారీ ఎత్తున విద్యుత్ వినియోగంలో ఆదా జరిగిందని అన్నారు.

03/27/2016 - 05:58

విజయవాడ, మార్చి 26: పుష్కర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం పుష్కరాలకై చేపట్టిన ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తొలుత రైల్వేశాఖ ద్వారా చేపట్టిన పనులను సమీక్షించారు.

03/27/2016 - 05:58

తిరుమల, మార్చి 26: తిరుమల కాలినడక మార్గంలో ఉన్న నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న శేషాచల అడవుల్లో శనివారం మరోసారి అటవీసంపద అగ్ని పాలైంది. శుక్రవారం జింకలపార్కు వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఎకరాలు అగ్నికి ఆహుతైనట్లు మంటలను ఆర్పిన సిబ్బంది తెలిపారు. ఆప్రమాదం జరిగి 24 గంటలు గడువక ముందే మరోమారు అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది అరగంటలోనే మంటలను అదుపుచేశారు.

03/27/2016 - 05:57

హైదరాబాద్, మార్చి 26: పోలవరం డ్యామ్ పరిధిలో ఉన్న ఏడు గ్రామాల నిర్వాసితులకు ఆర్.ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి ఖచ్చితంగా ప్రభుత్వం అందిస్తుందని, ఎవరికీ అన్యాయం చేసే అవకాశం లేదని రాష్ట్ర జలవనరుల నిర్వహణ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Pages