-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 20: ఓ వ్యక్తి కాల్వలో దూకి గల్లంతైన సంఘటన గురువారం మండలంలోని గొల్లగూడెం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హైద్రాబాద్లో నివాసం ఉంటున్న చిరుమర్రి వెంకటనాగశివరామకృష్ణ దీక్షిత్(34) 2015లో మండలంలోని ఓ వెంచర్లో ఇల్లు కొనుక్కున్నాడు. గురువారం ఆ ఇంటిని చూసేందుకు రెండవ భార్య రజనీరెడ్డితో కలిసి సదరు వెంచర్కు వెళ్ళాడు.
వరంగల్ క్రైం, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ మావోయిస్టు పార్టీ సీఆర్బీ(సెంటర్ రీజినల్ బ్యూరో) ప్రెస్టీం సభ్యుడు కడవంచ యాకస్వామి బుధవా రం వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీసు కమిషనర్ మావోయిస్టు పార్టీ దళసభ్యుడు లొంగుబాటు వివరాలను వెల్లడించారు.
పార్వతీపురం (రూరల్), సెప్టెంబర్ 19: తాళికట్టిన భర్త, కన్నబిడ్డలా చూసుకోవలసిన అత్తమామల వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు ఆడపిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. తాను లేకపోతే ఈ ఇలపై తన కూతుళ్లు ఏమైపోతారో? వారికి ఎవరు దిక్కని ఆలోచించిందేమో ? తన కన్న పేగును తానే తెంచుకుంది. కంటి పాపల్లా, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రాణాలను రైలుబండికి అర్పించింది.
చీమకుర్తి, సెప్టెంబర్ 19: ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన చీమకుర్తి పట్టణం నడిబొడ్డున మంగళవారం అర్ధరాత్రి దొంగతనానికి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దిండుకుర్తి సుబ్బారావు (60), ఆయన భార్య ఆదిలక్ష్మి (57)లను తలకాయలు కోసి పరారు అయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి, సెప్టెంబర్ 19: మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్కు సంబంధించి రీకాల్ పిటిషన్ వేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. బాబ్లీ అంశానికి సంబందించి ఈనెల 21వ తేదిన కోర్టుకు హాజరు కావాలని ధర్మాబాద్ కోర్టు అదేశించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మంత్రులు, అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించిన సీఎం చంద్రబాబు రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.
నెల్లూరు, సెప్టెంబర్ 19: నెల్లూరు జిల్లా తడలోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఈనెల 17న జరిగిన రూ.కోటి దోపిడీ కేసును నెల్లూరు పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. చోరీకి పాల్పడిన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ కొత్తపల్లి పవన్కుమార్ను బుధవారం ఉదయం నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని రుద్రకోట గ్రామ సమీపంలో పట్టుకున్నారు. అతని వద్ద నుండి చోరీ చేసిన నగదులో రూ.99,91,000లను స్వాధీనం చేసుకున్నారు.
సనత్నగర్, సెప్టెంబర్ 19: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య సంఘటన మరువక ముందే ఎర్రగడ్డలో అదే తరహాలో హత్యాయత్నానికి పాల్పడ్డాడో తండ్రి. కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో అల్లుడితో పాటు కన్న కూతుర్ని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం వారిని ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై ఉన్న ప్రతుల్ హోండా షోరూమ్ వద్దకు పిలిపించాడు. తన సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అతనితో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు.
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 19: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల 14న పట్టపగలు దారుణంగా దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్కుమార్ను హత్య చేసిన ఏడుగురు నిందితుల్లో ఆరుగురు నిందితులను మిర్యాలగూడ ఒన్టౌన్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం స్థానిక అదనపు జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ శోభారాణి ముందు హాజరు పర్చగా వారికి 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ , ఆయన భార్య తదితరులపై వచ్చిన అవినీతి అభియోగాల కేసులో వాదనలు వచ్చే నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఢిల్లీ కోర్టు ప్రకటించింది. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులకు అభియోగపత్రాలను, డాక్యుమెంట్లను కూడా పంపినట్లు కోర్టు పేర్కొంది.
హిస్సార్ (హర్యానా), సెప్టెంబర్ 19: ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత ఆమెను హత్య చేసిన నేరానికి 17 ఏళ్ల బాలుడికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో గల ఉల్కానా పట్టణంలో ఒక బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన 17 ఏళ్ల బాలుడికి హిస్సార్ కోర్టు ఈ శిక్ష విధించింది.