S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్గా మారాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు చాలామంది భామలు. ఇప్పటికే ఈ విషయంపై పలువురు భామలు పెదవి విప్పారు కూడా. లేటెస్టుగా బాలీవుడ్ భామ అలియాభట్ మాత్రం ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, అవకాశమిస్తే తనతో నటించేందుకు సిద్ధమేనని అంటోంది. అయితే ఆరడుగులపైన ఉండే ప్రభాస్తో అలియాకు జోడీ ఎలా కుదురుతుందో కదా!
తెలుగు ప్రేక్షకులకు కామెడీ అంటే ఎంత ఆసక్తో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్నంతమంది కమెడియన్స్ మరే భాషలోనూ లేరు. వెనె్నల సినిమాతో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు సంపాదించి, ఆ సినిమానే ఇంటి పేరు చేసుకున్నాడు వెనె్నల కిశోర్. ప్రస్తుతం ఆయన కీలక పాత్రలో నటించిన ‘అమీ తుమీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా వెనె్నల కిశోర్ చెప్పిన విశేషాలు.
కేశవతో కొత్త ఉత్సాహం..
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన పైత్యానికి ఒడిగట్టాడు సీనియర్ నటుడు చలపతిరావు. కొమ్మపై కూర్చుని చెట్టునే హేళన చేసిన అతని వైఖరి పరిశ్రమలో పెద్ద దుమారానే్న రేపుతోంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ తెరపై పోషించిన విలనీ పాత్రల వెకిలితనాన్ని పబ్లిక్ వేదికపై ప్రదర్శించి ఛీత్కారాలు అందుకుంటున్నాడు.
స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్హిట్ చిత్రాలతో మెప్పించిన యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేశవ’. మే 19న విడుదలై విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ ‘సినిమా పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది.
సోగ్గాడే చిన్నినాయన సినిమాతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నాగార్జున, కొత్తతరహా చిత్రాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగానూ మారారు. ఇప్పటికే పలు సూపర్హిట్ చిత్రాలు అందించిన నాగ్, తాజాగా నాగచైతన్య, రకుల్ప్రీత్సింగ్ జంటగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 26న సినిమా విడుదలకానున్న సందర్భంలో నాగార్జున వెల్లడించిన పలు విశేషాలు.
* సినిమా ఎలా వచ్చింది?
మహేష్బాబు, కొరటాల శివల కాంబినేషన్లో ప్లాన్ చేసిన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ నడుస్తోంది. షూటింగ్ మొదటి షెడ్యూల్ను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరుపుతున్నారు. మహేష్బాబు చిన్ననాటి సన్నివేశాలను కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్ సుమారు నాలుగు రోజులపాటు జరపనున్నారు. ఇది పూరె్తైన తర్వాత రెండో షెడ్యూల్ను జూన్ 16 నుంచి మొదలుపెట్టనున్నారు.
ప్రేమమ్ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆ ఒక్క సినిమాతోనే దక్షిణాది పరిశ్రమలో మంచి అవకాశాలే దక్కుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో మెగా హీరో వరుణ్తేజ్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘్ఫదా’ సినిమాలో నటిస్తున్న సాయిపల్లవికి, నేచురల్ స్టార్ నానితో జతకట్టే అవకాశం వచ్చిందని అంటున్నారు. నానితో కొత్త సినిమాకి దాదాపు సైన్ చేసినట్టేనన్నది ఇండస్ట్రీ టాక్.
రామ్చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్ల షూటింగ్ జరుపుకుంటున్న సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దసరాకు విడుదల చేయాలనే ప్రణాళికతో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా తర్వాత రామ్చరణ్ నటించే తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి.
ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఏకంగా 1500 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి దుమ్ము రేపింది. ఈ సినిమాకు దీటుగా ఏకంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త బి.ఆర్.శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడన్న వార్తలు వచ్చాయ.
బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో మేఘనా ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్-6 చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు వినాయక్ క్లాప్ ఇవ్వగా రాఘవ లారెన్స్ కెమెరా స్విచాన్ చేసారు. మరో దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ డిక్టేటర్ తర్వత నేను తెరకెక్కిస్తున్న ఆరవ చిత్రం ఇది.