S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/17/2019 - 01:41

ముంబై, జనవరి 16: లైంగిక వేధింపుల ఆరోణలు తగ్గుముఖం పట్టాయనుకున్న తరుణంలో ఓ మహిళ బాలీవుడ్‌లో పెద్ద బాంబు పేల్చారు. అయితే రాజ్‌కుమార్ హిరానీ అలాంటి వ్యక్తి కాదని ఎందరో బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, సంజు చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

01/17/2019 - 01:39

న్యూఢిల్లీ, జనవరి 16: దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూ కేసులో విద్యార్థినేతలపై దేశద్రోహం కింద చార్జిషీట్ దాఖలు చేయడాన్ని మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ తప్పుపట్టారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ తదితరులపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒక సభలో మాట్లాడిన వాటిని వక్రీకరించి తీవ్రమైన చార్జిషీట్ దాఖలు చేయడం దారుణమని బుధవారం ఆయన అన్నారు.

01/15/2019 - 03:52

త్రివిద దళాల పాటవానికి ప్రతీకగా గణతంత్ర వేడుకలకు భారత్ సన్నద్ధమవుతోంది. నౌక, వైమానిక, పదాతి దళాలు ఇందుకు సిద్ధమవుతున్నాయి. సోమవారం ఢిల్లీలో రిహార్సల్స్ అద్భుతంగా జరిగాయి. మహిళా సైన్యం కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంది. కనువిందుగా సాగిన ఈ కవాతు సైనిక పటిమకు అద్ధం పట్టింది

01/15/2019 - 02:49

బెంగళూరు, జనవరి 14: రాష్ట్రంలో తమ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి సమస్య లేదని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ఉద్ఘాటించారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చాలా బలంగా ఉందని, దీనిని కుప్పకూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు.

01/15/2019 - 02:48

లక్నో, జనవరి 14: లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఏ ప్రభు త్వం ఏర్పాటవుతుందో నిర్ణయించేదీ బిహార్, యూపీలేనని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. యూపీలో ఎస్పీ,బీఎస్పీ ఎన్నికల పొత్తు నేపథ్యంలో సోమవారం ఆయన ఇక్కడ మీడియాతోమాట్లాడారు. ఇది ఒక్క యూపీకే కాదు దేశంలో ఇలాంటి పొత్తులు ఏర్పడతాయని ఆయన చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండాలో నిర్ణయించేది బిహార్, యూపీ ప్రజలేనని ఆయన అన్నారు.

01/15/2019 - 02:45

జైపూర్, జనవరి 14: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓ పెద్ద సవాల్‌గా మారి దానిని ఓడించగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ఉద్ఘాటించారు.

01/15/2019 - 02:44

లఖింపూఖేరి (ఉత్తరప్రదేశ్), జనవరి 14: పొరుగునున్న పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల అస్థిర కార్యకలాపాల వల్ల కాశ్మీర్ ఓ సవాల్‌గానే పరిణమిస్తోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలకు పాల్పడ్డా సరిహద్దుల్లో అరాచకాలకు ఒడిగడుతున్నా భారత దళాలు సమన్వయంతో తిప్పికొడుతున్నాయని సోమవారంనాడు ఇక్కడ మీడియాతో అన్నారు.

01/15/2019 - 02:41

శబరిమల సన్నిధానంలోని అయ్యప్ప ఆడిటోరియంలో ప్రఖ్యాత గాయని సుశీలకు
సోమవారం హరివరాసన అవార్డును బహూకరిస్తున్న దృశ్యం. కేరళ ప్రభుత్వం దీన్ని నెలకొల్పింది

01/15/2019 - 02:26

న్యూఢిల్లీ, జనవరి 14: నిష్పాక్షికంగా, నిజాయితీగా దేశంలో ఎన్నికలు జరిగేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని ఫేస్‌బుక్ సహా సామాజిక మీడియా సంస్థలకు భారత ఇంటర్‌నెట్, మొబైల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగేందుకు అత్యంత కీలకంగా మారనున్నాయని పేర్కొంది.

01/15/2019 - 00:18

న్యూఢిల్లీ, జనవరి 14: మూడువేల మూడొందల సంవత్సరాల ఘనకీర్తి ఆ పట్టణం సొంతం. భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి తరతరాలుగా మూలకందంగా భాసిల్లుతున్న పవిత్ర నగరం అది. తరాలు అంతరిస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని ఆకట్టుకుంటూ భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న అయోధ్య నగర వైశిష్ట్యం నిరుపమానమే.

Pages