S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/18/2019 - 00:55

న్యూఢిల్లీ: సీబీఐలో సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద అధికారిగా పేరుతెచ్చుకున్న స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మనీషా కుమార్ సిన్హాలను సీబీఐ నుంచి బదిలీ చేశారు. సీబీఐలో వీరి నిర్ణీత పదవీ కాలం పూర్తి కాకుండానే బదిలీ వేటు వేశారు.

01/17/2019 - 23:39

ఆగర్తలా, జనవరి 17:త్రిపుల గిరిజన స్వయంప్రతిపత్తి మండలికి నిధులు కేటాయించనందుకు నిరసనగా వారం రోజుల పాటు ఆందోళన నిర్వహించనున్నట్లు సీపీఎం ప్రకటించింది. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన సీపీఎం నేత బిజన్‌ధార్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం స్వయంప్రతిపత్తి ఉన్న గిరిజన మండలికి రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. పక్షపాత ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

01/17/2019 - 16:44

బీహర్: బీజేపీలో ఏమైన ఇబ్బందులు ఉంటే నటుడు శత్రుఘ్న సిన్హా పార్టీ నుంచి వైదొలగొచ్చవచ్చని బీజేపీ సీనియర్ నేత, బీహర్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అసంతృప్తి నేత యశ్వంత్ సిన్హా ప్రభావానికి లోనై శత్రుఘ్న వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అసలు ఆయన పార్టీలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.

01/17/2019 - 16:42

న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్లపై విధించిన నిబంధనలను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తొలగించింది. విద్యాసంస్థలకు కీలోమీటరు దూరంలో డ్యాన్స్‌బార్లు ఉండాలన్న నిబంధనను కొట్టేసింది. అలాగే బార్లలో సీసీటీవీలు, కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలనే నిబంధనను కూడా కొట్టేసింది. బార్ రూమ్స్, ఫ్లోర్ల మధ్య గొడ ఉండాలనే నిబంధనను సైతం కొట్టేసింది.

01/17/2019 - 16:40

న్యూఢిల్లీ: శబరిమలైలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్న బిందు, కనకదుర్గ అనే మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు ప్రాణ హాని వుందని, రక్షణ కల్పించాలని వారు ఆ పిటిషన్‌లో కోరారు. సుప్రీం కోర్టు రేపు విచారణకు స్వీకరించనున్నది. ఈ ఇరువురు ఈనెల 2న అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన విషయం విదితమే. దీంతో హిందు సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే.

01/17/2019 - 13:03

ఢిల్లీ: జమ్ము-ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో లూటీ చేశారు. మోబైల్ ఫోన్స్, నగదు, నగలను అపహరించుకుపోయారు. ఢిల్లీ సమీపంలో ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు పదునైన కత్తులు చేబూని దాదాపు పది మంది వ్యక్తులు బీ3, బీ7 బోగీల్లోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కరి మెడపై కత్తిపెట్టి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

01/17/2019 - 12:40

మేఘాలయ: నెల రోజుల క్రితం ఇక్కడి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి జరుగుతున్న గాలింపు చర్యల్లో భాగంగా గురువారంనాడు ఒక మృతదేహం బయటపడింది. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ డిజార్ట్స్ రెస్పాన్స్ ఫోర్స్, కోల్ సిబ్బంది విస్తత్రంగా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. గురువారం నాడు లభించిన కార్మికుని మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. దాదాపు 160 అడుగుల లోతులో ఈ మృతదేహం లభ్యమైంది.

01/17/2019 - 04:28

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ కర్నాటకలో కాంగ్రెస్ శాసన సభ్యులను కొగొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కుట్ర చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

01/17/2019 - 02:35

న్యూఢిల్లీ, జనవరి 16: వైద్య పరీక్షల నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం రాత్రి హుటావుటిన అమెరికాకు బయలుదేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలపై పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 1వ తేదీన అరుణ్ జైట్లీ ఎన్డీఏ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

01/17/2019 - 02:29

ముజఫర్‌నగర్ (యూపీ), జనవరి 16: పేరుమోసిన ఆయుధాల స్మగ్లర్ మరోసారి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. ఆయుధాల కేసుకు సంబంధించి స్మగ్లర్ ఆరిఫ్ యూపీలోని షాలీ జిల్లాలో ఉన్నాడన్న సమాచారంతో హర్యానాకు చెందిన గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) బుధవారం దాడి చేయగా, ఆయన వారికి చిక్కకుండా తృటిలో పరారయ్యాడు. ఆరిఫ్ ఇలా పోలీసులకు చిక్కకుండా పరార్ కావడం ఈ వారంలో ఇది రెండోసారి.

Pages