కోవిడ్-19 మృతులు ఏడుగురు
Published Monday, 23 March 2020న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (కరోనా) వైరస్ సోకిన సంఖ్య ఆదివారం నాటికి 341కి చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించడంతో ఈ వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. బిహార్లో ఒక వ్యక్తి ఈ వైరస్తో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా పాట్నాలో 38 ఏళ్ల వయసున్న వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఖతర్ నుంచి ఇటీవల తిరిగివచ్చాడు. ఈ యువకుడు కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మరణించాడు.