S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెఫరెండం సరైనదే.. బ్రెగ్జిట్ విచారకరం

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగాలా? లేదా? (బ్రెగ్జిట్) అనే అంశంపై రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించేందుకు గతంలో తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ శనివారం సమర్ధించుకున్నారు. సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉన్న కీలక అంశాలపై ప్రజల అనుమతి తీసుకోకుండా పార్లమెంట్‌కు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

సైన్యం రిక్రూట్‌మెంట్‌కు ఇక రాతపరీక్ష తప్పనిసరి

జైపూర్, డిసెంబర్ 3: సైన్యంలో వివిధ కేటగిరిల్లో సవరించిన నిబంధల ప్రకారం సిపాయిల నియామకానికి శ్రీకారం చుట్టారు. జవాన్ల నియామకంలో శారీరక పరీక్షలే కాకుడా రాత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తదుపరి పరీక్షలకు పిలుస్తారు. సైన్యంలో తీసుకురాదలిచిన సంస్కరణకు సంబంధించి ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ జెకె మర్వాల్ శనివారం వెల్లడించారు. సైన్యంలో చేరాలనుకున్న అభ్యర్థి ముందుగా రాతపరీక్ష రాయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దానిలో ఉత్తీర్ణుడైతేనే తదుపరి పరీక్షలకు పిలుస్తారని ఆయన చెప్పారు.

ఎన్నికల చట్టాలపై సమగ్ర సమీక్ష

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజకీయాలను నేరరహితం చేయడంతో పాటు రాజకీయ పార్టీలకు అందే విరాళాలను ప్రక్షాళన చేయడానికి వీలుగా ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించిన ఎన్నికల సంఘం దేశంలోని ఎన్నికలకు సంబంధించిన అన్ని చట్టాలను సమగ్రంగా సమీక్షించే దిశగా సాగుతోంది. తాను పంపించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి స్పందనకోసం ఆతృతగా వేచిచూస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నసీం జైదీ శనివారం చెప్పారు. ధనబలం దుర్వినియోగం అయిన పక్షంలో సదరు ఎన్నికలను రద్దు చేసే అధికారాన్ని కూడా తనకు ఇవ్వాలని ఇసి ప్రభుత్వాన్ని కోరుతోంది.

9 కిలోల బంగారం పట్టివేత

ముంబయి, డిసెంబర్ 3: పెద్దనోట్ల రద్దు తర్వాత తాము ఇన్నాళ్లుగా దాచుకున్న డబ్బులను కాపాడుకోవడానికి నల్లకుబేరులు అనేక పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ముంబయిలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం రెండు కార్లలో తరలిస్తున్న 2.7 కోట్ల రూపాయల విలువైన 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి 9-10 కిలోల బంగారం తీసుకెళ్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని క్రైమ్‌బ్రాంచ్ డిసిపి షాహికాంత్ సతవ్ చెప్పారు.

నోట్ల రద్దు జైట్లీకి ముందే తెలుసు

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలియదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం దీనిపై స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం అరుణ్ జైట్లీకి ముందే తెలిసి ఉంటుందని వ్యాఖ్యానించారు. స్నేహంగా, బాహాటంగా వ్యవహరించే జైట్లీ సైతం ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారని అన్నారు. ‘నోట్ల రద్దు బాంబు పడిన తర్వాత జైట్లీ దాన్ని ఎలా రహస్యంగా ఉంచగలిగారని అందరూ ఆశ్చర్యపోయారు.. గొప్ప నేతల నిబద్ధత అది.

ఆర్మీపై ఆరోపణలా?

కోల్‌కతా, డిసెంబర్ 3: ‘ఆర్మీ వంటి బాధ్యతాయుతమైన వ్యవస్థపై ఆరోపణలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’ అంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి పరోక్షంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హితవు పలికారు. బెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాలను మోహరించడాన్ని నిరసిస్తూ, ‘సైనిక కుట్ర’కు పాల్పడుతున్నారా? అంటూ మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్మీకి సహాయ నిరాకరణ చేయొద్దు. ఆర్మీని అప్రతిష్టపాలు చేయొద్దు’ అని ఆయన అన్నారు.

మా జీతాల విత్‌డ్రాకు అనుమతించడం లేదు

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజధాని ఢిల్లీలో తమ హైకమిషన్‌లో పనిచేస్తున్న అధికారుల వేతనాలు విత్‌డ్రా చేసుకోకుండా భారత్ అడ్డంకులు కల్పిస్తోందని పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. పెద్దనోట్ల రద్దు మిషతో తమ దౌత్య అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పాక్ ధ్వజమెత్తింది. భారత్ తీరు వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించింది. ‘మా దౌత్యాధికారులు వేతనాలు విత్‌డ్రా చేసుకోకుండా ఆపితే మేమూ ఇదే వైఖరిని అవలంబించాల్సి ఉంటుంది. పాక్‌లో ఉన్న భారత దౌత్యాధికారులకు ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పాక్ హైకమిషన్ హెచ్చరించింది.

విదేశీ టూరిస్ట్‌పై రేప్ కేసులో ఎఫ్‌ఐఆర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో ఓ అమెరికా మహిళా టూరిస్టుపై అత్యాచారానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో విదేశీ మహిళపై అత్యాచారం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశారని వారన్నారు. ఐదుగురు వ్యక్తులు గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశారని ఎన్‌జివో ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రేపిస్టులు హెచ్చరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదని ఫిర్యాదులో వెల్లడించారు.

ఆర్మీ ఆపరేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగి మృతి

శ్రీనగర్, డిసెంబర్ 3: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు మృతి చెందారు. ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాల కన్నుగప్పి తప్పించుకోగలిగారు. అధికార వర్గాలు శనివారం ఇక్కడ తెలిపిన వివరాల ప్రకారం.. చాన్సర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు అందిన పక్కా సమాచారంతో సైనిక సిబ్బంది సహా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని శుక్రవారం రాత్రి చుట్టుముట్టాయి. బలగాలు చుట్టుముట్టిన కొద్ది నిమిషాల్లోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మత్స్యశాఖకు చెందిన ఉద్యోగి అసదుల్లా కుమార్ మృతి చెందారు.

పెట్రోల్ బంకుల్లో డిజిటల్ పేమెంట్లే

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో క్రెడిట్, డెబిట్ కార్డులనే కాదు.. ఇక ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్లనూ నగదుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, దీనివల్ల నగదు కొరత చోటుచేసుకుంది.

Pages