డిజిటల్కు మారాలి
Published Sunday, 4 December 2016హైదరాబాద్, డిసెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబాలు, సామాన్యులు నగదురహిత వ్యవహారాలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కోరారు. నగదురహిత కార్యకలాపాలను కొనసాగించే అంశంపై అవగాహన కల్పించేందుకు సచివాలయంలో ఉద్యోగులకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. కేంద్రం 500, వెయ్యి నోట్లను రద్దు చేయడంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలు మారాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో లావాదేవీలన్నీ డిజిటల్ తరహాలోనే కొనసాగుతాయని వివరించారు. నోట్ల రద్దువల్ల సమాజంలో విప్లవాత్మక మార్పు వస్తోందని కొత్త సిఎస్ ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు.