30నాటికి మెరుగు
Published Saturday, 3 December 2016న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశ వ్యాప్తంగా శుక్రవారం కూడా అన్ని బ్యాంకులు, ఎటిఎమ్లలో నగదు కటకట కొనసాగిన నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పట్లోగా పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. డిసెంబర్ 30నాటికి దేశంలో కరెన్సీ కొరత గణనీయంగా తీరుతుందని చెప్పారు. అయితే, 500, 1000 నోట్ల రద్దుకు ముందు దేశంలో వీటి పరిమాణం ఎంత ఉండేదో అంతా ఇక నుంచి ఉండక పోవచ్చునని పేర్కొన్నారు. అంటే ఒకప్పుడు ఉన్నంత పరిమాణంలో కాగితం కరెన్సీ ఇక మీద ఉండదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు.