భాజపాతోనే భవిత
Published Sunday, 27 November 2016ఏలూరు, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు కట్టుబడి వున్నాయని, ప్రజలంతా బిజెపికి బాసటగా నిలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని, మోదీ సర్కారు వచ్చి రెండున్నరేళ్లు అయినా ఒక్క అవినీతి ఆరోపణా రాకపోవడం ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు.