విలేజ్ సెట్లో
Published Sunday, 27 November 2016రామ్చరణ్ హీరోగా నటించిన ధృవ చిత్రం డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిలో ఆసక్తిని నెలకొల్పుతోంది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత చరణ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిఅయిన ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మితం కానుంది. సుకుమార్ మేకింగ్లో రూపొందే ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందట. 1980 నాటి కాలంలో జరిగే కథతో సుకుమార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరపాలని అనుకున్నారట.