వీధుల్లో విభిన్న చిత్రలేఖనాలు
Published Sunday, 27 November 2016హైదరాబాద్, నవంబర్ 26: కాస్త లేటైనా..మన జిహెచ్ఎంసి అధికారులకు లేటెస్టు ఆలోచన తట్టింది. ఈ నెల 1 నుంచి 24 వరకు పీపుల్స్ప్లాజాలో జరిగిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్లో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది చిత్రకారుల పెయింటింగ్లను చూస్తే గానీ మన పాలకులకు మంచి ఆలోచన రాలేదు. రోడ్లకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద భవనాలకు, ప్రహరీగోడలకు అందమైన, ఆకర్షణీయమైన చిత్రలేఖనాలను వేసి ఔరా అన్పించిన ఆర్టిస్టులు సాగర తీరన తాము నిర్వహించుకున్న ఈ ఫెస్టివల్ నగరవాసులకు గుర్తిండిపోయేలా ట్యాంక్బండ్పై ‘లవ్ హైదరాబాద్’ అక్షరాల శిల్పాని ఏర్పాటు చేశారు.