మోదీ ప్రతిష్ఠ మసకబారుతోందా..?
Published Sunday, 27 November 2016పాలకుల ఆలోచనలు, వారి అంచనాలు ఎప్పుడూ అతిగానే ఉంటాయి. తమకు నచ్చింది అందరికీ నచ్చితీరుతుందన్నది వారి భావన. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వారి నిర్ణయాలు జనాలకు అప్రియంగా కనిపిస్తుంటాయి. అయినా తమ ధోరణి మార్చుకోవడానికి సిద్ధపడని పాలకులు- ‘సర్వత్రా తమకు సానుకూలత వ్యక్తమవుతోందం’టూ చేతిలో ఉన్న మీడియా భజంత్రీలతో డప్పులు కొట్టిస్తుంటారు. ఆ డప్పుల మోత మర్మమేమిటో సామాన్యుడికి ఎరుకే. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో కూడా చాలామంది ఆమె నిర్ణయాన్ని సమర్ధించారు.