డేటా సర్వే కాదు... డైనమిక్ సర్వే
Published Sunday, 27 November 2016విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా సాధికారత సర్వే.. కుటుంబాలకు సంబంధించిన డేటా సర్వే మాత్రమే కాదని ఇదొక డైనమిక్ సర్వే అని సిఎం సంయుక్త కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న అన్నారు. ప్రజాసాధికారత సర్వే 2016ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో జరుగుతున్న పల్స్ సర్వే తీరుతెన్నులను తెలుసుకోవడానికి హర్యానా రాష్ట్రం నుంచి ఒక బృందం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపారు.