పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై ఉక్కుపాదం
Published Sunday, 27 November 2016ఏలూరు, నవంబర్ 26: దేశానికి స్వచ్ఛమైన పాలన అందిస్తూ, అన్నివర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదిని ప్రజలు దేవుని దూతగా చూస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ తీసుకున్న చర్యలను వివరిస్తూ ఎక్కడా అవినీతి మచ్చ లేని పాలన అందిస్తున్నారని ప్రస్తుతించారు. ఇలాంటి పరిస్ధితి చూసే జనం అంతా సంతృప్తిగా ఉన్నారని, అయితే ఇది భరించలేక విపక్షాలు అర్ధం లేని విమర్శలకు దిగుతూ యాగీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు.