కయ్యంవల్ల ప్రయోజనం ఉండదు
Published Thursday, 29 September 2016పాకిస్తాన్ అంశం చాలా సున్నితమైంది. ప్రస్తుత పరిస్థితులలో కయ్యానికి కాలు దువ్వితే ప్రయోజనం లేదు. యుద్ధం జరిగితే ఇరు దేశాలు చాలా నష్టపోతాయి. ఎంతిట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చర్చలు జరపడం వల్ల సమస్యకు పరిష్కారం లభించినా, లభించకపోయినా ఉద్రిక్తత పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కవచ్చు. జమ్ము కాశ్మీర్లో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరిపై మొదట అక్కడి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలను మానసికంగా పాకిస్తాన్ పట్ల ఏ విధమైన వైఖరితో అనసరించాలో ప్రజల సంసిద్ధం చేయాలి. ప్రజలను చైతన్య పర్చకుండా సమస్యకు పరిష్కారం లభించదు.