విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకం
Published Friday, 23 September 2016శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకమని జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సపై ఫస్ట్ మెడికల్ రెస్పాండర్ల నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో గురువారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విపత్తులు-కమ్యూనికేషన్ పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్లో ప్రధానంగా ప్రసార మాధ్యమాలు అత్యంత ఉపయోగకరమన్నారు. ప్రసార మాధ్యమాల సహకారంతో ప్రజలను అప్రమత్తం చేయడం సులభతరమన్నారు.