ఎస్కెయూ షటిల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
Published Friday, 23 September 2016హిందూపురం టౌన్, సెప్టెంబర్ 22 : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం షటిల్ బ్యాడ్మింటన్ జట్టును గురువారం స్థానిక ఎన్ఎస్పిఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. దాదాపు 60 మంది విద్యార్థినులు హాజరు కాగా ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. ఎస్కెయూ షటిల్ జట్టుకు హిందూపురం ఎన్ఎస్పిఆర్ కళాశాలకు చెందిన శిరీష, కీర్తి, అనంతపురం ఎస్కెయూకు చెందిన శాంతకుమారి, అనంతపురం కెఎస్ఎన్ కళాశాలకు చెందిన గౌతమి, అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాలకు చెందిన ఐశ్వర్యలు ఎంపిక కాగా జట్టు మేనేజర్గా హేమంత్కుమార్ ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ ముస్త్ఫా కమల్బాషా తెలిపారు.