25న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ రాక
Published Friday, 23 September 2016తిరుపతి, సెప్టెంబర్ 22: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఈనెల 25,26 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.55 గంటలకు తిరుచానూరులోని తోళ్లప్పగార్డెన్లో విశ్రాంతి తీసుకొని అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయత్రం 4 గంటలకు వేదిక్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరివెళతారు.