స్విస్ చాలెంజ్ కేసు విచారణ రేపటికి వాయిదా
Published Tuesday, 20 September 2016హైదరాబాద్: అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా విద్య, ఉపాధి రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టులో స్విస్ చాలెంజ్ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా అమరావతిలో పనులకు కాంట్రాక్టు సంస్థ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు తీసుకున్న సంస్థ మాదిరిగా మరేదైనా సంస్థ వస్తే ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు.