దురాక్రమణలే పాక్ నైజం అందుకే మూడు యుద్ధాలు
Published Tuesday, 20 September 2016జెనీవా, సెప్టెంబర్ 19: యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నైజాన్ని విశ్వ వేదికపై భారత్ ఎండగట్టింది. ఆక్రమిత కాశ్మీర్ను తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని కట్టిపెట్టాలని తెగేసి చెప్పింది. బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి, అక్కడ ఉంటున్న హిందువులపై సాగిస్తున్న దౌష్ట్యాల గురించీ ఐరాస మానవ హక్కుల 33వ సమావేశంలో భారత్ గట్టిగా ప్రస్తావించింది. భారత్లో ఏ ప్రాంతంలోనూ ఉగ్రవాదాన్ని, హింసాకాండను ప్రేరేపించకూడదని విస్పష్టంగా తెలియజేసింది. అలాగే తమ ఆంతరంగిక వ్యవహారాల్లో ఏ విధంగానూ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకూడదని ఉద్ఘాటించింది.