కొత్తగూడెం జిల్లాపై జలగం ముద్ర
Published Tuesday, 20 September 2016దమ్మపేట, సెప్టెంబర్ 19: జిల్లాల పునర్విభజన, రాజకీయ పునరేకీకరణ, అధికార వికేంద్రీకరణలో జలగం కుటుంబం పాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది. నాడు వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాగా అవతరించినప్పుడు జలగం వెంగళరావు కీలకపాత్ర పోషించగా నేడు ఖమ్మం జిల్లా నుంచి నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు కీలకపాత్ర పోషించనున్నారు. 1953లో వరంగల్ జిల్లా నుంచి వేరు చేసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. పూర్తిగా అటవీ ప్రాంతం, సాగునీరు లేక అల్లాడుతున్న బీడు భూములతో అప్పుడు ఈ ప్రాంతం ఉంది.