సాగునీరిచ్చి ఎండిన పంటల్ని కాపాడండి
Published Monday, 29 August 2016మైలవరం, ఆగస్టు 28: తక్షణమే సాగునీటిని అందించి ఎండిన పంటలను కాపాడాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేతలు ఎండిన వరి పొలాలను పరిశీలించారు. వర్షాలు పడక, సాగునీరు రాక వరి, పత్తి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న, పసుపు వంటి పంటలన్నీ ఎండిపోతున్నాయని ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఎండిన పంటలు చూసుకుని కన్నీరుమున్నీరవుతున్నారని ఇటువంటి దశలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి సాగునీటిని ఇప్పించి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.