దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకోవాలి
Published Monday, 29 August 2016విజయవాడ (కల్చరల్), ఆగస్టు 27: దళితుల అభ్యున్నతికోసం అవిరళ కృషి చేసిన దార్శినికుడు అయిన అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకుని దళితులు ముందుకు సాగాలని కేంద్ర మాజీ మంత్రి ఎంపి జెడి శీలం అన్నారు. ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్, ఎపి ఆధ్వర్యంలో మాదిగలు నేడు రేపు పుస్తకావిష్కరణ శనివారం సాయం త్రం గాంధీనగరంలోని ఒక హోటల్లో జరిగింది. ఈ పుస్తకంపై విశే్లషణ, చర్చ, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాదిగ మహిళలు, యువకులు, బాలల సాధికారత అంశంపై, దేశాభివృద్ధిలో మాదిగల స్థానం అంశంపై విశే్లషణ- చర్చ జరిగింది.