రోడ్డు మార్గానికి తొలగిన ఆటంకాలు
Published Monday, 29 August 2016కెపిహెచ్బి కాలనీ, ఆగస్టు 28: కొన్ని సంవత్సరాలుగా హైదర్నగర్ డివిజన్ సమతానగర్ నుండి మోర్ సూపర్మార్కెట్ సమీపంలోని జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సిన 60 అడుగుల రోడ్డు మార్గానికి ఆటంకాలు తొలగిపోయాయి. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ జానకిరామరాజు, అధికారులతో కలిసి రోడ్డు మార్గాన్ని పర్యవేక్షించారు. ప్రస్తుతం ప్రగతినగర్ మార్గం నుండి కొనసాగుతున్న వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే చొరవతో పలు మార్లు అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. గాంధీ మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.