పిఓకె శరణార్థులకు ప్యాకేజీ?
Published Monday, 29 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 28: పాక్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె) నుంచి తరలివచ్చి జమ్మూ-కాశ్మీరులోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. పిఓకెకి చెందిన వారితోపాటు పాకిస్తాన్లోని గిల్గిత్ ప్రాంత ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించబోతోంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను హోం శాఖ త్వరలో కేంద్ర మంత్రివర్గానికి నివేదించి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతుందని భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.