ప్రేమతోనే శాంతి
Published Monday, 29 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాశ్మీర్ సమస్యకు ప్రేమ, ఐక్యతలే అసలు సిసలైన మంత్రాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాశ్మీర్లో అశాంతిని రెచ్చగొట్టడానికి అమాయకులైన చిన్నారులను ఎగదోస్తున్న వారు ఏదో ఒక రోజు వారికి జవాబు చెప్పక తప్పదని కూడా ఆయన అన్నారు. కాశ్మీర్లో యువత, జవానుల్లో ఎవరు మరణించినా అది మనకు, దేశానికి తీవ్రమైన నష్టమని నెలవారీ ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆకాశవాణి ద్వారా చేసిన ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు.