రాజన్న సన్నిధిలో తుమ్మల, ఈటల
Published Tuesday, 5 July 2016వేములవాడ, జూలై 5: శ్రీ రాజరాజేశ్వరస్వామిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపి బోయనపల్లి వినోద్కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. మంత్రులు ఆలయంలోకి రాగానే ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, ఇవో రాజేశ్వర్, స్థానాచారి శంకరయ్య ఆధ్వర్యంలోని అర్చకులు పూర్ణకుంభంతో వారి ఎదురేగి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా వారు కోడె పూజ చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలోని శ్రీలక్ష్మిగణపతి స్వామివారికి వారితో అర్చకులు తొలి పూజలను చేయించారు. అక్కడి నుంచి లింగాకారంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు.