S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12 నుంచి కంచి స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ఒంగోలు అర్బన్, జూలై 4 : ఒంగోలులోని టిటిడి కల్యాణ మండపంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో కంచిపీఠం స్వాములు జయేంద్ర సరస్వతి మహాస్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆగమన ఆహ్వానానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మూడు రోజుల పాటు స్వామి వార్లు అందుబాటులో ఉండి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ప్రతి రోజూ కంచిపీఠ పూజతో పాటు స్వామి వారి అభిభాషణ ఉంటుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

భూగర్భజల మట్టాలు పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక

ఒంగోలు, జూలై 4: జిల్లాలోని 13 మండలాల్లో భూగర్భజల మట్టాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లాకలెక్టర్ క్షేత్రాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి భూగర్భజలాలు పెంపు, ప్రజాసాధికార సర్వే, మీకోసం అర్జీల పరిష్కారం, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం, నీరు -చెట్టు, సేద్యపుకుంటల నిర్మాణం, ఉపాధిహామీ పనులు, వర్మీకంపోస్టు, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈసమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మతోన్మాదాన్ని అంగీకరించడమే జాతీయవాదమా?

నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: మతోన్మాదాన్ని అంగీకరించటమే జాతీయవాదమైతే అది ఫాసిస్ట్ చర్య అవుతుందని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకులు జి కల్యాణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్‌హాలులో సోమవారం విరసం 46వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పురోగతి శ్రామికుల శ్రమతోనే ఇమిడి ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు. సోషలిజం స్వప్నసీమ కానేకాదని ఆకలంత సహజమని అన్నమంత అవసరమన్నారు. విప్లవాలు, ఉద్యమాల పరమావధి మనిషికి మానవత్వాన్ని చేకూర్చడమేనన్నారు. హిందూ మతోన్మాద శక్తులను సంఘటితంగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడిందన్నారు.

గిరిజనులను ఏకం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి

నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: గిరిజనులను ఏకం చేసి వారి హక్కుల కోసం, భారత దాస్య శృంఖలాలను చేధించటం కోసం అహర్నిశం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజని ఎజెసి సాల్మన్ రాజ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ భవన్‌లో సోమవారం సీతారామరాజు 120వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీల హక్కుల సాథన కోసం ఆంగ్లేయులతో అలుపెరుగని పోరాటం సల్ఫిన ఉద్మకారుడుని శ్లాఘించారు.

ఎపి జెన్‌కో థర్మల్ కేంద్రంలో కార్మికుడు మృతి

ముత్తుకూరు, జూలై 4: మండలంలోని నేలటూరు గ్రామ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఎపి థర్మల్ కేంద్రంలో సోమవారం జరిగిన ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే కార్మికుడు మృతి చెందాడు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు థర్మల్ కేంద్రంలోని ఐఎన్‌సి కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో రెండో యూనిట్ సెక్షన్ వద్ద సుమారు 20 మీటర్లు పైన కలిగిన లిఫ్టు నుంచి జారి పడటంతో కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

బయోమెట్రిక్ విధానం అమలయ్యేనా?

వేదాయపాళెం, జూలై 4: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ విద్యాసంవత్సరానికి గాను జూలై 1వ తేది నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలుపరచాలని రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. బయోమెట్రిక్ విధానం వల్ల విద్యార్థుల హాజరు ఆధారంగా బోధన రుసుముల చెల్లింపుల పథకం అమలు జరుగుతోంది. గత ఏడాది వలే ఈ ఏడాది కూడా ప్రతి కళాశాలలో బయోమెట్రిక్ విధానాన్ని కచ్చితంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు భిన్నంగా జిల్లాలో ఉన్నత కళాశాలల పనితీరు నడుస్తోంది.

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల అదుపు

నెల్లూరు, జూలై 4: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో విస్తృతంగా వినియోగిస్తున్నందు వల్ల నేరాలను గణనీయమైన స్థాయిలో అదుపులో ఉంచగలుగుతున్నామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోఏర్పాటైన వివిధ పోలీస్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం కానిస్టేబుళ్ల ఎంపికలో పలు మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కానిస్టేబుళ్ల వయోపరిమితిలో సడలింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు.

రైతుల పేరుతో కిసాన్ సెజ్ భూ దందా

నెల్లూరు, జూలై 4: రైతుల పేరుతో రాచర్లపాడు కిసాన్ సెజ్ నిర్వాహకులు భూ దందాకు పాల్పడుతున్నారని జిల్లా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇఫ్‌కో కర్మాగారానికి 1900 ఎకరాలను కేటాయించిందని, అయితే కర్మాగారం ఏర్పాటు జరగకపోవడంతో ఆ భూమిని కిసాన్ సెజ్‌కు ఇచ్చిందన్నారు. కాగా సెజ్ స్వాధీనంలో ప్రస్తుతం 2954 ఎకరాల భూమి ఉందని, సుమారు 1054 ఎకరాల ప్రభుత్వ భూమిని వారు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

సమన్వయంతో మొక్కలు నాటాలి: కలెక్టర్

నెల్లూరు, జూలై 4: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొక్కలు నాటడానికి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జానకి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వన మహోత్సవంపై కలెక్టర్ జానకి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను, విద్యార్థులను, భాగస్వాములుగా చేసి విజయవంతం చేయాలన్నారు. ఈనెలలో కనీసం 10 లక్షల మొక్కలు నాటాలని అధికారులను ఆమె ఆదేశించారు. పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు.

స్మార్ట్ పల్స్ సర్వేకు సన్నద్ధం!

కర్నూలు, జూలై 4 : రాష్ట్రంలోని ప్రజల సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటింటి సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే అనంతరం రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతివ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం వద్ద ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సర్వే మొదటి విడత గత నెల 20 తేదీనే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వీలుకాలేదు. దాంతో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించినా ఆ రోజు రంజాన్ పర్వదినం కావడంతో ఆ మరుసటి రోజు నుంచి సర్వేను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Pages