12 నుంచి కంచి స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
Published Tuesday, 5 July 2016ఒంగోలు అర్బన్, జూలై 4 : ఒంగోలులోని టిటిడి కల్యాణ మండపంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో కంచిపీఠం స్వాములు జయేంద్ర సరస్వతి మహాస్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆగమన ఆహ్వానానికి సంబంధించిన వాల్పోస్టర్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మూడు రోజుల పాటు స్వామి వార్లు అందుబాటులో ఉండి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ప్రతి రోజూ కంచిపీఠ పూజతో పాటు స్వామి వారి అభిభాషణ ఉంటుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.