షట్టర్ల వినియోగానికి అనుమతి ఇవ్వండి!
Published Tuesday, 5 July 2016శ్రీకాకుళం, జూలై 4: ఏభై కోట్ల రూపాయల వంశధార షట్టర్ల కుంభకోణాన్ని సి.ఐ.డి. అధికారులు విచారణలు చేసీచేసి... చివరికి ఐదు కోట్లు విలువచేసే షట్టర్లు తుప్పుపట్టిపోతున్నాయంటూ నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన వీడియోకాన్ఫరెన్స్లో మిగిలిన ఆ మాత్రం షట్టర్లు అయినా అనుమతిస్తే వంశధార కుడి, ఎడమ కాల్వల కింద గల కాలిబాట బ్రిడ్జిలకు వినియోగిస్తామంటూ కోరిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం అవినీతి షట్టర్లలో మిగిలిన వాటిని వినియోగించుకోవడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.