పోలవరం కాలువ పనులు పూర్తి చేయండి
Published Tuesday, 5 July 2016నూజివీడు, జూలై 4: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగం సిద్ధణ చేస్తున్నారని, బుధవారం నీరు విడుదల చేస్తారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండలంలోని సీతారామపురంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. రామిలేరు, తమ్మిలేరుపై జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.