మళ్లీ పెరిగిన బంగారం ధర
Published Saturday, 18 June 2016దిల్లీ: అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.57శాతం పెరిగి 1,298.10 యూఎస్ డాలర్లకు చేరింది. తగ్గిందనుకున్న పసిడి ధర శనివారం రూ.150 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,800కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.