జల్సాల కోసం
Published Saturday, 18 June 2016ఏలూరు, జూన్ 17 : జల్సాలు, షికార్లకు అలవాటుపడిన యువత పక్కదారి పట్టింది. చివరకు బంధువుల ఇంటిలోనే దోపిడీ సీన్ చిత్రించి బంగారాన్ని దొంగతనం చేశారు. చివరకు పోలీసుల విచారణలో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న యువతీయువకులు కటకటాల పాలయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. స్థానిక పవర్పేటలో నివాసముంటున్న ఎన్ సరస్వతి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. పెదపాడు మండలం వసంతవాడలో నివాసముంటున్న తన పెద్దమ్మ అనంతలక్ష్మి ఇంటికి ఈ నెల 13న సరస్వతి వెళ్లింది. అక్కడ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం కోసం అంటూ ఆ ఇంటికి చేరుకుంది.