చంద్రన్న చేయూత ద్వారా లక్ష మంది ఎస్సీలకు శిక్షణ
Published Sunday, 15 May 2016విజయవాడ, మే 14: రాష్ట్రంలో లక్ష మంది యస్సి యువతకు చంద్రన్న చేయూత పథకంలో భాగంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆలోచన సరళి విధానాలను మెరుగుపరిచేలా అందరం సమష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర సాంఘిక సంయేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. చంద్రన్న చేయూత కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాల అదనపు జాయింట్ కలెక్టర్లు, సోషల్ వెల్ఫేర్ జిల్లా స్థాయి అధికారులకు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు, వెండర్లతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై శనివారం నాడిక్కడ నిర్వహించిన కార్యశాలకు మంత్రి హాజరయ్యారు.