టీటిడిపికి ఢోకా లేదు
Published Sunday, 15 May 2016హైదరాబాద్:తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లిపోయినంతమాత్రాన పార్టీకి నష్టం లేదని, ప్రజల్లో ఆదరణ ఉందని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడిపి తుడిచిపెట్టుకుపోయిందన్న టిఆర్ఎస్ నేతల ఫ్రచారంలో అర్థం లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో వైకాపా తుడిచిపెట్టుకుపోతున్న విషయాన్ని గమనించాలని అన్నారు.