కార్మికుల హక్కులను హరిస్తున్న చంద్రబాబు
Published Sunday, 1 May 2016విజయనగరం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, కార్మికుల సమస్యలపై ఆందోళన చేపడుతున్న నాయకులను ముఖ్యమంత్రి అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు.శనివారం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.