చంద్రబాబు అవినీతిపై విచారణ జరపండి
Published Sunday, 1 May 2016జగ్గయ్యపేట, ఏప్రిల్ 30: చంద్రబాబు పాలన అవినీతిమయమని, ప్రలోభాలకు గురిచేసి అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని వైకాపా రాష్ట్ర నేత సామినేని ఉదయభాను ఆరోపించారు. ఎపి ప్రభుత్వంపై సమగ్ర నివేదికను ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సవివరంగా అందించి వచ్చారని, కేంద్రానికి నిజాయితీ ఉంటే పార్టీ ఫిరాయింపుల నుండి ప్రభుత్వ అవినీతి వరకూ సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన టిడిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండేళ్ల పాలన అవినీతిమయమని, ఆ సొమ్ముతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.