డివిజన్ రైల్వే సలహా సంఘ సభ్యునిగా వరప్రసాద్
Published Sunday, 1 May 2016మొగల్తూరు, ఏప్రిల్ 30: విజయవాడ రైల్వే డివిజన్ సలహా సంఘ సభ్యునిగా మొగల్తూరు గ్రామానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు చెల్లుబోయిన వెంకట శ్రీనివాస్వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రసాద్కు విజయవాడ రైల్వే డివిజన్ డిసిఎం ఎన్ సత్యనారాయణ శనివారం నియామక పత్రం అందజేశారు. వరప్రసాద్ నియామకం పట్ల నరసాపురం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ గున్నిశెట్టి శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి మునుకోటి వెంకటేశ్వరరావు, మండల బిజెపి అధ్యక్షుడు దాసరి ప్రసాదరావు, కార్యదర్శులు పులపర్తి రమేష్, మామిడిశెట్టి నరసింహమూర్తి తదితరులు అభినందించారు