రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Published Sunday, 1 May 2016సదాశివపేట, ఏప్రిల్ 30: ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన పరమేశ్వర్ గౌడ్ (56), అందోల్ మండలం నేరేడిగుంటకు చెందిన మల్లేశం (26) ఈ ప్రమాదంలో మృతి చెందారు.