ఆకట్టుకున్న ఎడ్లబండి, ద్విచక్ర వాహనాల ర్యాలీ
Published Sunday, 1 May 2016నాగర్కర్నూల్, ఏప్రిల్ 30: పట్టణంలో శనివారం జరిగే వివిధ అభివృద్ది పనులలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి స్వగృహం నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, మర్రి జనార్ధన్రెడ్డి, ఆలె వేంకటేశ్వరరెడ్డిలు బుల్లెట్ వాహనాలు నడుపుతూ ముందుండగా వారిని అనుసరిస్తూ పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహానాల ర్యాలీ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువు వరకు కొనసాగింది.