S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణ్‌కు జోడిగా శ్రుతి

శ్రుతిహసన్ మంచి జోరుమీదుంది. తమిళ, తెలుగు సినిమాల్లో జెట్ స్పీడ్‌తోవున్న శ్రుతికి అవకాశాలు లెక్కకుమించి అవుతున్నాయి. మెగా హీరో రామ్‌చరణ్ నెక్స్ట్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అయ్యింది శ్రుతి. గతంలో వీళ్లిద్దరు -ఎవడు చేశారు. తాజాగా రామ్‌చరణ్ నటిస్తున్న తమిళ రీమేక్ తనిఒరువన్ సినిమా వచ్చేనెలలో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం శ్రుతిహసన్‌తో చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ దాదాపు పూర్తికావొచ్చింది. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడికానున్నాయి.

మళ్లీ.. అష్టాచమ్మా?

అప్పట్లో వచ్చిన అష్టాచమ్మా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు నాని. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న నాని, ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో హీరోగా సెటిలయ్యాడు. ఇటీవలే భలేభలే మగాడివోయ్ హిట్టుతో మంచి ఊపుమీదున్న నాని, తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అవకాశాలు ఇంటిముందు క్యూ కడుతున్నా -తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే వీరిమధ్య చర్చలు జరిగాయంటున్నారు. వచ్చే నెలలో సినిమా సెట్స్‌పైకి రానుంది. అన్నట్టు ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపిస్తాడట.

నిఖిలే పెద్ద కంటెంట్

ఉదయనందనవనమ్ దర్శకత్వంలో ఎంవివి సత్యనారాయణ రూపొందించిన ‘శంకరాభరణం’ చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్‌ను హైదరాబాద్‌లో అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. నిఖిల్, నందిత జంటగా వస్తున్న చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసినపుడే కొత్తగా ఉందనిపించిందని, నిఖిల్ సినిమా విడుదలవుతుందంటే ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళల్లో తానూ ఒకడినని అన్నారు. నిఖిల్ చిత్రాల్లో మంచి కంటెంట్ ఉండేలా కథలను ఎంచుకుంటాడని, కోన వెంకట్ కథ కథనాలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయన్నారు. తప్పక ఓ బెంచ్ మార్క్ చిత్రంగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

రాశిఫలం 21-11-2015

తిథి : శుద్ధ దశమి మ.2.57
నక్షత్రం : పూర్వాభాద్ర మ.1.28
వర్జ్యం : రా.10.25 నుండి 11.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.06.00 నుండి 07.36
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1పా.)
నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.
వృషభం (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.)

ప్లాటినమ్ వేడుకలో ఎఫైర్

శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రలుగా శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం -ఎఫైర్. చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. నిర్మాత తుమ్మలాపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం మొత్తాన్ని దర్శకుడు శ్రీరాజన్ తానై రూపొందించాడన్నారు. ఎఫైర్‌తో శ్రీరాజన్ పెద్ద దర్శకుల జాబితాలోకి వెళ్తాడని, హీరోయిన్లు ఇద్దరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ కష్టపడి పని చేశారని, అయితే, అనుకున్న సమయానికి ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నందున ఎఫైర్ విడుదలను వాయిదా వేశామన్నారు. నవంబర్ 27న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

‘ఓ స్ర్తి రేపురా’

ఆశీష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతిమోల్, మనాలీ రాధోడ్ ప్రధాన తారాగణంగా అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’. ఆడియో విడుదలలో తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీ్ధర్ పాల్గొని సీడీలు విడుదలచేశారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రస్తుతం హారర్ ట్రెండ్ సాగుతున్న దృష్ట్యా అదే తరహాలో చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్రం ట్రైలర్లు, పాటలు బాగున్నాయని, ఇటీవల విడుదలవుతున్న హారర్ చిత్రాల స్థాయిలో లాభాలు తేవాలని మధుర శ్రీ్ధర్ అన్నారు.

కార్తికం పరమ పవిత్రం

శివకేశవులిద్దరికీ అమిత ప్రీతికరమైన మాసం కార్తికం. నదీస్నానాలు, దీపతోరణాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయిక్కడ. శివాలయాలన్నీ దీపాలవెలుగులో కాంతులీనుతుంటాయి. అభిషేకాలు, బిల్వపత్రార్చనతో నమఃశివాయ నామంతో మారుమ్రోగుతుంటాయి.
వైష్ణవాలయాల్లో తులసీర్చనలు, జాజిపూలు, చామంతులతో అలంకారాలు దగదగామెరిసే దీపకాంతులతో లక్ష్మీనారాయణులు ప్రకాశంవంతంగా కనిపిస్తారు. అటు అర్థనారీశ్వరుడైన శివుడు భక్తులను మోక్షపదవినిచ్చి అలరిస్తూ ఉంటే ఇక్కడలక్ష్మీనారాయణులు భక్తుల కోరికలను ఈడేరుస్తుంటారు. ఇలా శివకేశవలిద్దరూ భక్తుల మొరలు వినడానికి భూలోకానికి వేంచేస్తారని భక్తుల నమ్మకం.

- రావుల రాజేశం

జైమిని భారతం - 91

ఆ రాజు కలలో కూడా బొంకు పలకని సత్యవ్రతుడు. ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు అక్కడి ప్రజలు కూడా సత్యాన్ని ఆరాధించేవారే. వీరవర్మకు ఇల్లరికపుటల్లుడు యమధర్మరాజు. వీరవర్మ మహాదాత. ‘బ్రాహ్మణోమమదేవాః’ అని నిత్య బ్రాహ్మణారాధన బుద్ధి కలవాడు.
ధర్మరాజు మయూరధ్వజుల యాగాశ్వాలు తన రాజ్యంలో పాదం మోపాయని తెలుసుకొన్న వీరవర్మ గుఱ్ళాన్ని బంధించుడని భటులకు ఆజ్ఞాపించేడు.

-- బులుసు వేంకటేశ్వర్లు

అమ్మానాన్నకు - 52

‘‘ఏ అమ్మా నాన్న అయినా ఉండే ఒకే ఒక్క కొడుకును రెండేళ్లపాటు ఇంటికి తీసుకుపోకుండా ఉంటారా? వీళ్లిద్దరూ ( అమ్మా నాన్నను చూపించి) రెండేళ్లలో ఒక్కసారి కూడా వాళ్ళబ్బాయిని ఇంటికి తీసుకుపోలేదు. వాళ్లకు చదువు గొప్పతనం తెలుసు. వాళ్ల కొడుకు గొప్పవాడు కావాలనేదే వాళ్ల కోరిక. అందుకోసం వాళ్లు కొడుకుమీది ప్రేమను త్యాగం చేశారు.. మహేష్‌ను వాళ్లింటి దగ్గరనుంచి తీసుకొచ్చిన రోజున మాటిచ్చా, మీ అబ్బాయిని ర్యాంక్‌తో పంపిస్తానని. నా మాట నిలబెట్టుకున్నా’ అన్నారు కరస్పాండెంట్.
మీడియా అంతా అమ్మా నాన్నను చుట్టుముట్టారు. వాళ్లిద్దరూ కరస్పాండెంట్ చెప్పిందే చెప్పారు.

-సుంకోజి దేవేంద్రాచారి

నేర్చుకుందాం

సీ. సంధ్యలం దొనరించు సద్విధుల్ గడచిన ధర్మలోపం బగుఁ దడయ కేల
బోధింప వై తని భూసురప్రవరుండు వదరునో బోధింపఁబడి యవజ్ఞ
దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప నని యల్గునో దీని కల్గెనేని
యలుకయ పడుదుఁ గా కగునె ధర్మక్రియా లోపంబు హృదయంబులో సహింప’
ఆ. నని వినిశ్చితాత్మయై నిజపతిఁబ్రబో ధించె మునియు నిద్ర దేఱి యలిగి
‘యేల నిద్ర జెఱచి తీవు’ నావుడు జరత్కారు విట్టు లనియెఁ గరము వెఱచి

Pages