అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
Published Wednesday, 24 June 2015కౌడిపల్లి, జూన్ 23: హైదరాబాద్కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్స్టేషన్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగల ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అనే వ్యక్తి 45 దొంగతనాలకు పాల్పడి ఐదేళ్లపాటు జైలు శిక్షను అనుభవించి 2009 సంవత్సరంలో జైలు నుండి బయటకు వచ్చాడు. మహ్మద్ షఫీ, మహ్మద్ ముజాహిద్ పాషా, మీర్జా షోయబ్ బేగ్, మిర్జాఇర్ఫాన్ బేగ్లతో ఒక దొంగల ముఠాగా ఏర్పర్పుచుకొని కిడ్నాపులు, దొంగతనాలు, హత్యలకు పాల్పడ్డారు.