S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

క. ‘నను నీవు సేయు ప్రశ్నము
జన సన్నుత వేద శాస్త్ర సారాంశంబై
ఘనమగు హరిగుణ కథనము
వినుమని, వినిపింప ఁ దొడంగె వేడ్క దలిర్పన్

ధన ప్రాశస్త్యం

మహాభారత సంగ్రామంలో జగత్ప్రసిద్ధమైన కర్ణుడి మరణాన్ని జీర్ణించుకోలేక ధర్మరాజు వేదన చెందాడు. అశాంతితో తల్లిడిల్లినాడు. తల్లి కుంతీదేవి, సోదరులు ఎంత ఊరడించినా ధర్మజుని మనస్సు శాంతించలేదు. అర్జునునితో ధనంజయా! పూజ్యుడు, జ్యేష్ఠభ్రాతయైన కర్ణునీ, సకల బాంధవులనూ యుద్ధంలో చంపి మహా పాపంచేశాను.

ఆత్మవిమర్శ అవసరం

రోజూ షూటింగ్‌ల్లో పాల్గొంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏ తప్పు ఎప్పుడు చేశామో గుర్తుండకపోవచ్చు. అందుకే మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవంటోంది అందాలరాశి శృతిహాసన్. నన్ను నేను ఎప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను. నాలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను చేసిన తప్పేంటో ఇతరులు చెప్పకముందే గుర్తించేసి సర్దుకుంటాను. నటనలో మన వ్యక్తిత్వంలో ఎప్పటికప్పుడు స్పష్టమైన అభిప్రాయాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు అని సుద్దులు చెబుతోంది ఈ సుందరి.

వధువు చెబితే వినాలి!

‘వెయ్యి అబద్ధాలాడైనా పెళ్లి చేయాలన్న’ది ఒకప్పటి మాట. అయితే, మగపెళ్లివారు ఒక్క అబద్ధం చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వధువు తాళి కట్టించుకునేందుకు ‘ససేమిరా’ అనడంతో వివాహవేడుక రద్దయ్యింది. వరుడి విద్యార్హతల గురించి తనకు అబద్ధం చెప్పారని తెలియడంతో పెళ్లికుమార్తె ఈ నిర్ణయం తీసుకుంది. గణితానికి సంబంధించి తాను వేసిన చిన్న ప్రశ్నకు వరుడు తప్పుడు సమాధానం ఇవ్వడంతో ఆమె విస్మయం చెందడమే గాక ‘ఏ మాత్రం తెలివితేటలు లేని వాడితో తాళి కట్టించుకునే ప్రసక్తే లేద’ని తెగేసి చెప్పింది. వినడానికి వింతగా ఉన్నా ఈ సంఘటన ఇటీవల కాన్పూర్ జిల్లా (యుపి) రసూలాబాద్‌లో జరిగింది.

కరివేపాకుతో కమ్మటి వంటలు

కరివేపాకు ప్రతి కూరలోనూ అవసరమే. శరీరంలో రక్తపుష్టికి దోహదపడుతూ ఎనీమియా, మలబద్ధకం,
అజీర్ణం వంటి అనారోగ్యాలను తగ్గించి కరివేపాకు బలం చేకూరుస్తుంది. మొదటి ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎలర్జీలు, జీర్ణకోశ వ్యాధులు,
విరేచనాలు, గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గుముఖం పడతాయ. పోపులకు, పులిహోరలో,
పులుసుల్లో వాడే కరివేపాకు మనకు నిజంగా ఆరోగ్య ప్రదాతే.

పచ్చడి

ఆడపిల్లను కంటే.. ‘గిఫ్ట్ ప్యాక్’ ఉచితం

లింగ వివక్ష, భ్రూణహత్యలను నివారించేందుకు దంపతులకు ఉచితంగా ‘గిఫ్ట్ ప్యాక్’లను అందజేయాలని రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినందున సామాజిక చైతన్యం కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. ‘ఆడశిశువుకుటుంబానికి భారం కాద’న్న విషయమై దంపతుల్లో అవగాహన పెంచేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు. ఆడపిల్ల జన్మించిన ఇంటికి వెళ్లి గిఫ్ట్ ప్యాకెట్లతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి చిన్న పుస్తకాలను అందజేస్తున్నారు. దుస్తులు, బొమ్మలు వంటివి ఈ గిఫ్ట్ ప్యాకెట్లలో ఉంటాయి.

మండే ఎండతో జాగ్రత్త సుమా..

ముకుందం వయసు అరవై ఏళ్లు. పనిమీద పొరుగూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా ఎండెక్కింది. బస్టాండ్‌కు వచ్చేసరికి కళ్ళు తిరిగి బెంచీపై వాలిపోయాడు. పక్కనున్న ప్రయాణికులు వెంటనే ముఖాన చల్లటి నీళ్ళు చల్లి తగిన సపర్యలు చేయడంతో ముకుందం బతికి బయటపడ్డాడు.
***
రాజమ్మ వ్యవసాయ కూలీ. ప్రతిరోజూ పనికి వెళ్లనిదే పూట గడవదు. ఎప్పటిలా ఆ రోజు కూడా పనికెళ్లింది. పని చేస్తున్నపుడు ఒక్కసారిగా తల తిరిగినట్లనిపించి గట్టుపై వాలిపోయింది. సహచర కూలీలు పక్కనున్న చెట్టుకిందికి తీసుకెళ్ళారు. చల్లటి నీళ్ళు ముఖాన చల్లి ఉపశమనం చేశారు. చాలా సేపటికిగానీ ఆమె కోలుకోలేదు.
***

భవిష్య కాలం

కె.వి.ఎం.సురేశ్‌బాబు, ఒంగోలు
ప్ర: మనశ్శాంతితో స్థిరపడే యోగం ఉన్నదా?
సమా: ఒకే లక్ష్యంతో, ఒకే దీక్షతో భగవద్గీతను గురువుగా భావిస్తూ ప్రయత్నించండి. ఫలితం లభిస్తుంది. శాంతి బయట లేదు, మనలోనే ఉంది. ‘మనసే మనిషికి తీయని వరమూ, మనిషి బ్రతుకు నరకవౌను మనసు తనది కానిచో’ అంటూ సినీ గీతాలైనా గొప్ప నీతిని బోధించాయి. ఆలోచించండి.
డి.రేవతి, గజపతినగరం
ప్ర: నా సంకల్పం నెరవేరుతుందా?
సమా: ఆ అవకాశం లేదు. పెద్దల మాటనే పాటించండి.
ఎ.సుజాత, రామకృష్ణనగర్ (నెల్లూరు)
ప్ర: ఆరోగ్య విషయం..

పెట్రోహబ్‌గా ట్రింకోమలీ

కొలంబో, మార్చి 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, శ్రీలంక శుక్రవారం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌కు వ్యూహాత్మక పొరుగుదేశంగా ఉన్న శ్రీలంకతో సంబంధాలను పెంపొందించుకునేందుకు చేపట్టనున్న పలు చర్యలను మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ట్రింకోమలీని పెట్రోలియమ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయాన్ని అందజేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేస్తూ, శ్రీలంకలో రైల్వే రంగం అభివృద్ధికి 31.8 కోట్ల డాలర్ల వరకు రుణాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. హిందూ మహాసముద్రంలోని మూడు దేశాల్లో జరుపుతున్న పర్యటనలో చివరిగా మోదీ శుక్రవారం ఉదయం కొలంబో చేరుకున్నారు.

Pages