పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
Published Saturday, 20 June 2015మహబూబ్నగర్, జూన్ 19: తెలంగాణ ప్రాంతంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని భీమా ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజి 46తోపాటు శంకరసముద్రం, రామన్పాడు ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలను మంత్రి పరిశీలించారు.